Inspections :హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారిణి

by Kalyani |
Inspections :హోటళ్లలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారిణి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని పలు హోటళ్లలో, సూపర్ మార్కెట్లలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారిణి టి.సునీత, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎం.ఎ.ఖలీల్ లు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పరిశుభ్రత సరిగా పాటించని వారికి నోటీసులు అందజేశారు. అలాగే ఆహార పదార్ధాల తయారీలో వాడుతున్న నిషేధించబడిన రంగులు, గడువు ముగిసిన ఉత్పత్తులను పారవేశారు. ఇలాగే కొనసాగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార వ్యాపారస్థులు ఫసై లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. లేనిచో వారికి భారీ మొత్తంలో జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.



Next Story