రెండు గ్రామాల్లో అగ్నిప్రమాదం

by Kalyani |
రెండు గ్రామాల్లో అగ్నిప్రమాదం
X

దిశ, లింగంపేట : లింగంపేట్ మండలంలోని సజ్జన్ పల్లి, బాచంపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నివాసపు గుడిసె పెంకుటిల్లు దగ్దమై 3 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు గిర్ద్వార్ బాలయ్య తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు గ్రామాల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఆయన తెలిపారు, సజ్జన పల్లి గ్రామానికి చెందిన నీల పోచయ్య నివాస గృహంలో బట్టలు బియ్యం, వంట పాత్రలు తదితర వస్తువులు అగ్నికి కాలి బూడిద అయినట్లు తెలిపారు.

సుమారు 50 వేల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది అన్నారు. అలాగే బాచంపల్లి గ్రామానికి చెందిన కండ్లపల్లి సాయిలు నివాసగృహం కాలిపోవడంతో రెండున్నర లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. సాయిలు నివాస గృహంలోని బోరు మోటారు బట్టలు, బియ్యం, వంట పాత్రలు ,విలువైన టేకు కలప సామాగ్రి తదితర వస్తువులు కాలి బూడిద అయినట్లు ఆయన తెలిపారు, సోమవారం రెండు గ్రామాలను గిర్ద్వార్ బాలయ్య సందర్శించారు.

Advertisement

Next Story