రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించాలి

by Sridhar Babu |
రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం అందించాలి
X

దిశ, బాన్సువాడ : ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వీచిన ఈదురుగాలులు, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలోని లక్ష్మీ సాగర్ తండా, మేడిపల్లి, లక్ష్మాపూర్, చందూరు, పోతంగల్ మండలంలోని టాక్లీ, సోంపూరు, యాద్గార్ పూర్ గ్రామాలలో మూడు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని చందూరు, పోతంగల్, కోటగిరి మండలాల్లోని కొన్ని గ్రామాలలో మూడు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట దెబ్బతిన్నదని, ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందన్నారు. రైతుల బాధ చూస్తుంటే ఒక రైతుగా తాను తట్టుకోలేకపోతున్నా అని అన్నారు. సర్వే చేసి పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story