ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

by Naresh |
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. నిజామాబాద్ ఏసీబీ అధికారులు ఎన్పీడీసీఎల్ ఏఈ రాజు రూ.12500 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి 33/11 కె.వి. సబ్ స్టేషన్‌లో (ఏఈ కార్యాలయం)లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed