"గంప" సహకారంతో మరింత అభివృద్ధి..

by Sumithra |
గంప సహకారంతో మరింత అభివృద్ధి..
X

దిశ, భిక్కనూరు : ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోవర్ధన్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సర్పంచ్ మల్లేష్ మంజుల మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ఎన్ఆర్ జీఎస్ నిధులు కోటి రూపాయలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులను ఆమె కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే విప్ గంప గ్రామం పై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామంలోని ప్రధాన రోడ్లన్నింటిని, డబుల్ రోడ్లుగా మార్చి విశాలంగా చేశాడని, మిగిలిన ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు వేస్తామని వివరించారు. గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పెద్దబచ్చగారి నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టెడి భగవంత రెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, ఆర్బీఎస్ చైర్మన్ మల్లేష్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, సొసైటీ వైస్ చైర్మన్ మద్ది స్వామి, ఎంపీటీసీ సభ్యురాలు కాసాల లక్ష్మీ బాలా గౌడ్, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు తుడుం స్వామి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధరాంరెడ్డి, చిన్నమద్ధి సిద్ధ రాములు, తాటిపాముల నాగభూషణం గౌడ్, కర్ణాల మల్లేశం, గౌరీ గారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed