న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ.. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ నేత మృతి

by Mahesh |
న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ.. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ నేత మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ నేత మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. కామారెడ్డి జిల్లా నసు‌రుల్లబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుడి పై దాడి చేశారు. ఈ గొడవలో కాంగ్రెస్ నాయకుడు సాదుల రాములు ( 45) మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story