సుభాష్ నగర్ లో చైన్ స్నాచింగ్​

by Kalyani |
సుభాష్ నగర్ లో చైన్ స్నాచింగ్​
X

దిశ, నిజాంబాద్ క్రైo; నిజామాబాద్ నగరంలో గొలుసుదొంగలు రెచ్చిపోయారు. మంగళవారం సాయంత్రం సుభాష్ నగర్ లో నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళ మెడలో నుంచి తులంనరా బంగారు చేను లాక్కొని పరారీ అయ్యారు. నగరంలోని ఆదర్శనగర్ చెందిన నీరాడి లక్ష్మి సుభాష్ నగర్ లోని శిశు గృహం లో కేర్ టేకర్ గా పనిచేస్తుంది. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రామాలయం రహదారిలో బైక్ పై వచ్చిన అగంతకుడు లక్ష్మీ మెడలోని బంగారు చైను లాక్కొని పరారీ అయ్యాడు. బాధితురాలు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed