బ్యాంక్ మేనేజర్ పై కేసు నమోదు

by Sumithra |
బ్యాంక్ మేనేజర్ పై కేసు నమోదు
X

దిశ, లింగంపేట్ : లింగంపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ ఆర్య రాజు పై కేసునమోదు చేసినట్లు లింగంపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. పోల్కంపేట గ్రామానికి చెందిన తలారి కిష్టయ్య గత ఆగస్టు మాసంలో మృతి చెందినప్పటికీ ఆయన ఖాతాలోని డబ్బులు ఈనెల 26వ తేదీన ఇతర వ్యక్తులు డ్రా చేయడం పై గురువారం బ్యాంకు ఎదుట రైతులు గ్రామస్తులు ఆందోళన చేశారు. తలారి కిష్టయ్య ఖాతా నుండి డబ్బులు డ్రా చేసిన విషయమై కిష్టయ్య కుమారుడు సాయిబాబా ఫిర్యాదు మేరకు బ్యాంక్ మేనేజర్ పై కేసునమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story