దేవతామూర్తులకు గంగ నీళ్లతో అభిషేకం…

by Kalyani |
దేవతామూర్తులకు గంగ నీళ్లతో అభిషేకం…
X

దిశ, ఆలూర్ : విడిసి ఆధ్వర్యంలో ఆలూరు కేంద్రంలోని అన్ని దేవతామూర్తులకు ఆదివారం రోజున గంగనీలతో అభిషేకము నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నలిమెల మోహన్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం రెండుసార్లు గంగనీలతో అభిషేకం నిర్వహిస్తామని అది ఆషాడం మాసం కంటే ముందు ఒకసారి, శ్రావణం మాసం తర్వాత మరొకసారి గంగ నీళ్ళతో అభిషేక నిర్వహిస్తామని తెలిపారు. ఇది తాత ముత్తాతల నుండి వస్తున్న ఆచారం అని , అభిషేకించడం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయి అని అన్నారు. ఊరి ప్రజలు సుఖశాంతులతో ఉంటారని , ఇలాంటి కీడు దరి చేరదని నమ్మకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కెర విజయ్ , విడీసీ మెంబర్స్ గంగాధర్, మధు,శేఖర్,వినోద్, నవతే గంగాధర్ ,అనిల్, రమేష్ ఊరి గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed