మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన చాకలి రాములు (41) అనే వ్యక్తి మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఎర్రోళ్ల లలితను వివాహం చేసుకొని చాకలి రాములు గత కొన్ని సంవత్సరాల క్రితం చిన్న కొడప్ గల్ గ్రామం నుండి బొల్లారం గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. లలిత, రాములు దంపతులకు ముగ్గురు కూతుర్లు గాయత్రి, గంగోత్రి , సంధ్య ఉన్నారు.

కాగా రాములు ఈనెల మూడో తేదీన తన భార్యను మద్యం కోసం డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. రాములు ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం బొల్లారం గ్రామ శివారులోని కన్నయ్య కుంట వద్ద పురుగుల మందు తాగి మృతి చెంది ఉన్నాడని గ్రామస్తుల ద్వారా తెలిసింది. మృతుడు రాములు మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని భార్య చాకలి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.

Next Story