- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సాలూర చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు
దిశ,బోధన్ : ఆర్టీఏ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం సాలూర అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ పై నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీపీ ఇన్స్పెక్టర్లు నగేష్, శ్రీనివాస్, వేణు ఇతర అధికారులు రైడ్ చేయగా అక్రమ వసూళ్ల కు సంబంధించిన 13500 రూపాయలను సీజ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. వాహనాదారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తనిఖీలలో తేలిందని, అక్రమ వసూళ్ల కు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు
సాలూర అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు రైడ్ రవాణాశాఖ అధికారులలో కలకలం రేపింది. జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయలలో అధికారులు అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులను, ప్రైవేట్ ఏజెంట్లను లోపలకి అనుమతించలేదు.