- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చెరువులో జారిపడి యువకుడు మృతి
దిశ, భిక్కనూరు : ఒడ్డుపై కూర్చొని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రానికి చెందిన గంట వేణు (38) చేపలు పట్టడానికి బొబ్బిలి చెరువులోకి వెళ్లాడు. ఒడ్డుపై కూర్చొని చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మరికొందరు చేపలు పట్టేందుకు వచ్చినవారు నీట మునుగుతున్న వేణును కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం
లేకుండా పోయింది. ఈ విషయం తల్లి వెంకటవ్వకు, కాలనీవాసులకు తెలియడంతోవెంటనే వారు ఘటన స్థలానికి తరలివచ్చారు. మృతదేహాన్ని పాతాళ గరిగె తో రెండు గంటల తరువాత బయటకు తీశారు. చెరువులో పడి మృతి చెందిన వేణు దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చెరువులో పడి మృతి చెందడంతో తల్లి వెంకటవ్వ గుండెలవిసేలా రోదిస్తుంది. ఈ మేరకు భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.