భర్తను హత్య చేయించిన భార్య

by Sridhar Babu |
భర్తను హత్య చేయించిన భార్య
X

దిశ, మద్నూర్ : నిత్యం గొడవకు దిగుతున్న భర్తను మరో ముగురితో కలిసి హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల కేంద్రంలో మస్నాజీ(45) ని ఆయన భార్య మాలన్ బాయి తన మేనల్లుళ్లు ఇద్దరు, మరో వ్యక్తితో కలిసి హత్యకు ప్లాన్ వేశారు. నిన్న గురువారం మధ్యాహ్నం డోంగ్లిలో మస్నాజీ పై వీరు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. కుటుంబ విషయంలో గత కొంతకాలంగా తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త బాధలు భరించలేక మాలన్ బాయి హత్య చేయించింది. ఘటనా స్థలాన్ని బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ పరిశీలించారు. మద్నూర్ ఇంఛార్జ్ ఎస్. సాయిలు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed