అంక్సాపూర్‌లో 17 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

by Mahesh |
అంక్సాపూర్‌లో 17 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవారం రాత్రి పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 17 మంది పేకాట రాయుళ్లను, ఒక లక్ష 43 వేల నగదు, 16 సెల్ ఫోన్లను, పేక ముక్కలను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడిలో పేకాట రాయుళ్లను, పేకాట నిర్వాహకులతో పాటు, మరి కొంతమంది ప్రముఖులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Next Story