- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ బదిలీ.. ఆయన స్థానంలో ఎవరంటే?
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఐఏఎస్ ఆఫీసర్ వికాస్ రాజ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను రిలీవ్ చేసిన ఈసీ.. వికాస్ రాజ్ స్థానంలో సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు వికాస్ రాజ్ ఆధ్వర్యంలోనే జరిగాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఎన్నికల ప్రధాన అధికారిని నియమించడం ఆసక్తికర పరిణామంగా మారింది.
Advertisement
Next Story