పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొదటి రోజు మూడు నామినేషన్లు

by Disha Web Desk 11 |
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొదటి రోజు మూడు నామినేషన్లు
X

దిశ,నల్లగొండ: వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికల్లో భాగంగా మొదటి రోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయగా , ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్ రెడ్డి ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య ఒక్క సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిలకు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి రోజు మొత్తం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు.

Next Story

Most Viewed