- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
![మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివి మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివి](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347588-b.webp)
దిశ, పెన్ పహాడ్ : ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ కోసం జరిగిన 30 ఏళ్ల పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరుల త్యాగాలు మరువలేనివని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు ఒగ్గు సోమన్న అన్నారు. జులై 7న లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను ఆదివారం మండల కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగిన పోరాటం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
30 ఏళ్ల పోరాటంలో సురేందర్ , భారతి, ప్రకాష్, జీవా, మహేష్, ప్రభాకర్, రవి వంటి ఎంతోమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి అమరత్వం పొందారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ పోరాటానికి మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మీసాల నాగయ్య, బొల్లికొండ వీరస్వామి, నన్నపంగా నవీన్, గంగారపు హరికృష్ణ, కత్తి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.