ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ..

by Vinod kumar |
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ..
X

దిశ, భూదాన్ పోచంపల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రమణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిషన్ వివరాలు, స్టాఫ్ విద్యార్థుల హాజరు వివరాలను కళాశాల ప్రిన్సిపల్ విజయ భాస్కర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యాంశాల బోధన, త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యాల గురించి తరగతి గదిలోని విద్యార్థుల అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరుకావాలని, పరీక్షలలో ఉత్తమ ఫలితాలను రాబట్టి కళాశాల పేరు నిలబెట్టాలని కోరారు. అనంతరం సిబ్బంది సమావేశం నిర్వహించి విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరచాలని సూచించారు. పలు రికార్డులు తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఏడాది మంచి ఫలితాలు రాబట్టినందుకు కళాశాల ప్రిన్సిపాల్‌ను, సిబ్బందిని అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed