ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అధికారులు చూడాలి

by Kalyani |
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అధికారులు చూడాలి
X

దిశ ,మర్రిగూడ: గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పాలన కొనసాగించాలని నాంపల్లి ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశం మందిరంలో ఆమె అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్పంచుల పదవీకాలం ముగిసిన వేళ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పంచాయతీ కార్యదర్శులు చూడాలని ఆమె కోరారు. ఐదు సంవత్సరాలు తనకు సహకరించిన అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ఏవి రెడ్డి ఎంపీటీసీలను ఎంపీపీ సన్మానించగా… అధికారులు ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మేరీ స్వర్ణకుమారి, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చిలువేరు పెద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.



Next Story