ఎమ్మెల్యేను కలిసిన కిష్టరాయనపల్లి భూ నిర్వాసితులు...

by Kalyani |
ఎమ్మెల్యేను కలిసిన కిష్టరాయనపల్లి భూ నిర్వాసితులు...
X

దిశ,చింతపల్లి : డిండి ఎత్తిపోతల పథకం నుండి కిష్టారాయనపల్లి, శివన్న గూడెం ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన అప్పటిలో ఆ ప్రాజెక్టుల కింద పోయినటువంటి భూములు, ఇండ్లు కిష్టరాయనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈదల గండి భూములకు ప్రభుత్వ నష్టపరిహారం కింద డబ్బులు కట్టిస్తామని ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు.

మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించేది లేదని అని శనివారం రోజు ఎమ్మెల్యే తో గ్రామ ప్రజలు తమ ఆవేదన చెప్పుకుంటూ ఆర్ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.ఈ విషయంపై ఎమ్మెల్యే బాలు నాయక్ సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరీక్షిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కమలమ్మ వెంకట నరసింహారెడ్డి శత్రజ్ఞ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story