అభివృద్ధి పనులకు శంకుస్థాపన

by Naveena |
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి :బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభంఅనిల్ కుమార్ రెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు‌. బీబీనగర్ మండలంలో ట్రైబల్ వెల్పేర్ నిధులతో మొత్తం నాలుగు రోడ్లకు రూ. 9.80 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గొల్లగూడెం నుంచి అనాజీపురం బీటీ రోడ్డుకు నీలంబావి వద్ద రూ. 2. 10 కోట్లు..సూరేపల్లి చందుగానీ తండా బీటీ రోడ్డుకు 3. 15 కోట్లు మంజూరు చేశారు. అలాగే ముగ్దుంపల్లి నుంచి రామునిగుండ్ల తండా రోడ్డుకు 2. 45 కోట్లు, చిన్నరావులపల్లి నుంచి సీనాతండా బీటీ రోడ్డుకు..సీనాతండా వద్ద 2.10 కోట్లు నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story

Most Viewed