వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి

by Kalyani |
వృద్ధురాలి మెడలో గొలుసు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి
X

దిశ, గరిడేపల్లి : వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అబ్బిరెడ్డి గూడెం ఆవాస గ్రామమైన సుభాష్ నగర్ గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… సుభాష్ నగర్ గ్రామానికి చెందిన గాదే రామ నరసమ్మ(65) తన పొలంలో పెసర్ల పంట వేసిందని, తన పొలం వద్దకు ఉదయం వెళ్ళగా ఆమె వద్దకు ఒక గుర్తు తెలియని వ్యక్తి తనకు కొంత దూరంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి క్రషర్ మిల్లుకు ఎలా వెళ్ళాలని అడిగి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని తన ద్విచక్ర వాహనం పై పారిపోయినాడని అన్నారు. బాధితురాలు గాదే రామ నరసమ్మ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై ఈట సైదులు తెలిపారు.



Next Story