దొంగతనం కేసులో నిందితులు అరెస్ట్....

by Kalyani |
దొంగతనం కేసులో నిందితులు అరెస్ట్....
X

దిశ,చింతపల్లి : చింతపల్లి మండలం కుర్మేడు గ్రామానికి చెందిన గోరేటి బక్కమ్మ బంగారు గొలుసు అపహరణ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక ఎస్సై యాదయ్య వివరాలు వెల్లడించారు. బక్కమ్మ తన వ్యవసాయ పొలంలో పనుల చేసి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి మహిళ మెడలో నాలుగు తులాల బంగారం దొంగతనం చేశారన్నారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని తెలిపారు. ఆదివారం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed