- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పిడుగుపాటుకు 12 మేకలు మృతి
దిశ,నేరేడుచర్ల: పిడుగు పడి 12 మేకలు మృతి చెందగా..నాలుగు మేకలు వాగులో కొట్టుకుపోయిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మూసీ ఒడ్డు తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం పుల్గంబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మూసి ఒడ్డు తండాకు చెందిన బాణోత్ బాలు, బాణోత్ హేమ్లా, బాణోత్ సైదాలు తమకు ఉన్న మేకలను పొలం దగ్గర మేపేందుకు వెళ్ళారు. సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మేకలు సమీపంలోని చెట్టుకిందకు చేరుకున్నాయని బాధితులు తెలిపారు. ఆయా చెట్టు పైన పిడుగు పడటంతో.. చెట్టు కింద ఉన్న 27 మేకల గుంపులో బాణోతు బాలుకు చెందిన 10మేకలు, హేమ్లా, సైదాకు చెందిన చేరొక మేక మృతి చెందాయని తెలిపారు. పిడుగుపాటుకు బెదిరిన మరో నాలుగు మేకలు ప్రక్కనే ప్రవహిస్తున్న చిల్లేపల్లి మూసీ నదిలో కొట్టుకపోయాయి. ఈ ప్రమాదంలో బాధితులు ఏమి జరగలేదు. సుమారు రూ.2.50 లక్షల విలువ గల మేకలు మృతి చెందాయని బాధితులు తెలిపారు. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.