- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ను ఖండించిన బండి సంజయ్
దిశ, వెబ్డెస్క్: హోలీ పండుగ ముందు రోజు కామదహనం చేస్తున్న చెంగిచెర్ల పిట్టల బస్తీకి చెందిన వారిపై ముస్లిం యువకులు దాడులు చేయగా పలువురిగా గాయాలయ్యాయి. ఈ దాడులపై బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ దాడులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టకుండా తిరిగి బాధితులపై క్రిమినల్ కేసులు పెట్టారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం బండి సంజయ్ బాధితులను పరామర్శించగా.. నేడు చంగిచెర్ల బాధితులను పరామర్శించడానికి నేను వస్తున్నాను అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజాసింగ్ చెంగిచెర్లకు వెళితే సమస్యలు తలెత్తుతాయని.. ముందస్తుగా రాజాసింగ్ను హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సందించారు.
బీజేపీ ఎమ్మెల్యే గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రాజాసింగ్ను అపడం ఎవర వల్ల కాదని.. ఆయన ఇవాల కాకపోతే రేపు, ఎప్పుడైన వెళ్తాడని, రాజా సింగ్ను ఎన్నిరోజు చంగిచెర్లకు వెళ్లకుండా అపగలరని.. చెంగిచెర్ల ఎమైన పాకిస్థాన్లో ఉందా అని బండి ప్రశ్నించారు. అలాగే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను అడ్డుకుంటుంది, హిందువులపై కేసులు పెట్టడం, బాధితులను పరామర్శించే నాయకులను అడ్డుకోవడం చేస్తుందన్నారు. అలాగే అమాయక హిందువులపై దాడులు చేస్తున్న రోహింగ్యా మాఫియాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు, పేదలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.