- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
హైదరాబాద్కు చేరుకున్న MLC కవిత.. ఎయిర్పోర్ట్ వద్ద గ్రాండ్ వెల్కమ్
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్కు చేరుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. కవితతో పాటు కేటీఆర్ సహా కుటుంబసభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు ఉన్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత కవిత హైదరాబాద్కు వచ్చారు. ఇదిలా ఉండగా.. కవిత రాక సందర్భంగా 500 కార్లతో ఆ పార్టీ శ్రేణులు భారీగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బంజారాహిల్స్లోని కవిత నివాసానికి ఆమెకు భారీ ర్యాలీగా తీసుకురావాలని నిర్ణయించారు. ఇంటికి వచ్చాక.. ఇవాళే కేసీఆర్తో కవిత భేటీ కానుంది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రే బయటకు వచ్చారు.