- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLA Rajasingh : కేటీఆర్ పై ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Race Case)లో ఏసీబీ(ACB), ఈడీ(ED)ల విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను ఉద్దేశిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Raja Singh)సెటైరికల్ ట్వీట్(Satirical Tweet)చేశారు. కర్మ ఎవరిని మరిచిపోదని. బీఆర్ఎస్ హయాంలో నన్ను అక్రమంగా జైల్లో పెట్టారని..ఇప్పుడు మీకు కూడా అదే గతి పట్టబోతోందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు(కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్(జెల్లో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండని కేటీఆర్ కు సూచించారు.
స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దని..చలి తీవ్రత కంటే కర్మ తీవ్రత ఎక్కువ అని కేటీఆర్ పై రాజాసింగ్ వ్యంగ్యోక్తులు విసిరారు. ఇతరులను లక్ష్యంగా చేసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేసే వారు చివరికి వారి స్వంత ఔషధాన్ని రుచి చూస్తారని..కర్మ మరచిపోదు, అది సరైన క్షణం కోసం వేచి ఉందని రాజాసింగ్ చురకలేశారు. రాజాసింగ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.