పేపర్లు విసిరికొట్టి మరి మహిళా ఉద్యోగిపై MLA రాజగోపాల్ రెడ్డి సీరియస్

by Rajesh |
పేపర్లు విసిరికొట్టి మరి మహిళా ఉద్యోగిపై MLA రాజగోపాల్ రెడ్డి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ రోజు వరకు పన్నులతో కలిపి ఎంత బిల్లు రికార్డు అయిందో చెప్పాలని అధికారులను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించగా.. మహిళా ఉద్యోగి పేపర్‌పై ఏదో రాస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేపర్లను విసిరి కొట్టి అడిగిన దానికి సమాధానం చెప్పాలని నాలెడ్జ్ ఉందా అసలు మీకు.. నాలెడ్జ్ ఉంటే పని చేయండి లేకుంటే లీవ్ పెట్టి వెళ్లిపోవాలన్నారు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలని మీరు చెబితే వినేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాజగోపాల్ రెడ్డి మహిళా ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed