సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తాం: MLA Raja Singh ఫైర్

by Satheesh |
Raja Singh
X

దిశ, తెలంగాణ బ్యూరో: తిరుమలలో పురాతన మండపాన్ని కూల్చడమంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమేనని.. ఈ అంశంలో సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ‌ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మండపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి ఆంధ్రులది మాత్రమే కాదు.. యావత్తు భారతీయులదని జగన్ గుర్తుంచుకోవాలని అన్నారు. అడిగే వారు లేరన్నట్లు ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు

Advertisement

Next Story

Most Viewed