విలీన గ్రామాలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు షాకింగ్ కామెంట్స్

by Satheesh |
విలీన గ్రామాలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర విజభన సమయంలో ఏపీకి కేటాయించబడిన విలీన గ్రామాలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని అనేక సమస్యలు పదేళ్లు అయిన పరిష్కారం కాలేదని అసహనం వ్యక్తం చేశారు. భద్రాచలంలోనూ స్థలాల సమస్య ఉందని.. కనీసం డంపింగ్ యార్డ్ కూడా లేదని అన్నారు. కాగా, విలీన గ్రామాలపై మంత్రి తుమ్మల చేసిన కామెంట్స్ అటు ఏపీ, ఇటు తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Next Story