మూసీతో కోటి మంది ఎఫెక్ట్ అవుతున్నారు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-10-11 12:54:57.0  )
మూసీతో కోటి మంది ఎఫెక్ట్ అవుతున్నారు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : మూసీ(Musi) నది మురికి వలన, దాని కాలుష్యం వలన దాదాపు కోటిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అంతమంది ఇబ్బందులను దూరం చేసేందుకు మూసీ ప్రక్షాళనకు పూనుకుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిపనులు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదని, వారి ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల మాఫీనే 4 విడుతలుగా చేశారని.. కాని మా ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని మంత్రి మండిపడ్డారు.

Advertisement

Next Story