నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మెల్యే బండారి..

by Sumithra |
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మెల్యే బండారి..
X

దిశ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాప్రా సర్కిల్ డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని త్యాగ రాయనగర్ లో రూ. 30 లక్షల నిధులతో చేపట్టే భూగర్భ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed