బయో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ సీజ్

by Aamani |
బయో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ సీజ్
X

దిశ, పేట్ బషీరాబాద్: ఎటువంటి అనుమతులు లేకుండా బయో ప్రొడక్ట్స్, బయో స్టిమ్యులేట్ మెటీరియల్ ను తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు. సుభాష్ నగర్ డివిజన్ రామిరెడ్డి నగర్ లో పిలిగ్రిమ్స్ అగ్రిటెక్ అండ్ కెమికల్స్ పేరిట సాదు సతీష్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఇతను ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు ఉండకుండా బయో ప్రొడక్ట్స్, బయో స్టిమ్యులేట్ ప్రొడక్ట్స్ ను తయారు చేయడం, అమ్మడం, నిలువ ఉంచడం చేస్తూ వస్తున్నాడు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో కుత్బుల్లాపూర్ గండి మైసమ్మ మండలం అగ్రికల్చర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి యాదగిరి కంపెనీలో తనిఖీలు చేశారు. నిర్వాణకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ శాఖ అధికారి ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed