నివేదితకు బీఫాం అందజేసిన కేసీఆర్..

by Disha Web Desk 23 |
నివేదితకు బీఫాం అందజేసిన కేసీఆర్..
X

దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి : కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు గులాబీ దళపతి కేసీఆర్ బీఫాం ను గురువారం తెలంగాణ భవన్ లో అందించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత విజయ దుందుభి మోగించాలని కేసీఆర్ ఆశీర్వదించారు.ఎన్నికల ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించి, ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు. సర్వేలు, దివంగత ఎమ్మెల్యేలు సాయన్న,లాస్య నందిత లు అందించిన సేవలు, ప్రజల అభిప్రాయం ప్రకారం చూస్తే కంటోన్మెంట్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కె సి ఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్ కు కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మల్కాజిగిరి టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed