- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేయర్, డిప్యూటీ మేయర్లకు ఝలక్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు నమోదు
దిశ, మేడ్చల్ బ్యూరో : ఎన్నికల ఉల్లంఘనలపై జవహర్ నగర్ మేయర్ , డిప్యూటీ మేయర్ లపై కేసు నమోదైంది. మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తో పాటు మరో 5 మంది కార్పొరేటర్ల ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన విషయం విధితమే.ఈ నెల 27 వ తేదీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాలను ప్రారంభించడమే కాకుండా.. ఆసరా ఫించన్లు పంచారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ‘దిశ ’ దినపత్రిక వెబ్ సైట్ తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
దీంతో జవహర్ నగర్ మున్సిపల్ కమీషనర్ తాజ్ మోహన్ రెడ్డి, ఎన్నికల అధికారి ప్రభాకర్ లు మేయర్, డిప్యూటీ మేయర్ లతో సహా ఐదుగురు కార్పొరేటర్ల ఎన్నికల ఉల్లంఘనలపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఇన్ స్పెక్టర్ నాగరాజు మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తో పాటు శారద, లావణ్య, నాగరాణి, పల్లపు రవి, ప్రేమల శ్రీనివాస్ లపై కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఎన్నికల ఉల్లంఘన లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.