ఫాక్స్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత

by Aamani |   ( Updated:2024-09-13 15:53:23.0  )
ఫాక్స్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత
X

దిశ, పేట్ బషీరాబాద్: జీడిమెట్ల ఫాక్ సాగర్ చెరువులో వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఈ చెరువులో చేపల అమ్ముకొని జీవనాధారం పొందుతున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ పూర్ణిమ శుక్రవారం చెరువును సందర్శించారు. చెరువులో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటంతో పాటుగా, పలు పారిశ్రామిక రసాయనాలు కలవడంతోని చేపలు మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మరోసారి శనివారం నాడు ఈ అంశంపై చెరువును పరిశీలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed