- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
పార్టీయే ప్రజలు.. ప్రజలే పార్టీ : టీపీసీసీ అధ్యక్షుడు
దిశ, దుండిగల్ : పార్టీయే ప్రజలు ప్రజలే పార్టీ అని రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రభుత్వంతో మమేకమవుతూ పార్టీని పతిష్టపరుస్తానని నూతనంగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన సందర్భంగా మాజీ ఎమ్యెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆహ్వానం మేరకు దూలపల్లిలోని ఆయన నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో మమేకమవుతూ పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానన్నారు. పార్టీ ఏ మిన్న పార్టీ ఏ సర్వస్వం, ఆ తరువాతే పదవులు అన్నారు.
అందరిని కలుపుకొని పార్టీ ప్రతిష్టకు కృషిచేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. పార్టీ ప్రతిష్ఠకి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు, టీపీసీసీ అధ్యక్షుడుగా నియమించినందుకు అధిష్టానానికి రుణపడి ఉంటానన్న, అంతకు ముందు వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లాకు పంపిస్తున్న నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యే అరికెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కోలన్ హన్మంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలు పాల్గొన్నారు.