CI : బోనాల పండుగ శాంతియుతంగా జరుపుకోవాలి

by Kalyani |
CI : బోనాల పండుగ శాంతియుతంగా జరుపుకోవాలి
X

దిశ,ఉప్పల్: బోనాల పండుగ శాంతియుతంగా జరుపుకోవాలని నాచారం సీఐ జి రుద్విర్ కుమార్ అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ లో గురువారం నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో ఈ నెల 28 న జరగనున్న బోనాల పండుగ నేపథ్యం లో ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.సీఐ రుద్విర్ కుమార్ మాట్లాడుతూ బోనాలు,తోట్టేలా ఊరేగింపు కార్యక్రమాలపై పలు సూచనలు,సలహాలు ఇచ్చారు. ఉత్సవాల పేరుతో శాంతి భద్రతలకు ఆటంకాలు కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి. వెంకటయ్య,నాచారం, మల్లాపూర్ ప్రాంతాల ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Next Story