Paralympics: పారాలింపిక్స్‌లో పతకం.. తెలంగాణ యువతిపై ప్రధాని మోడీ ప్రశంసలు

by Mahesh |   ( Updated:2024-09-04 15:34:23.0  )
Paralympics: పారాలింపిక్స్‌లో పతకం.. తెలంగాణ యువతిపై ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్(Paralympics)లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పతకాలు సాధిస్తూ భారత్(India) పేరును టెబుల్ల పట్టికలో ముందు వరుసలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ చెందిన యువతి దీప్తి జీవాంజి(Deepti Jeevanji).. మహిళల 400 మీటర్ల టీ20 పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. ఈ క్రమంలో దీప్తిని భారత ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము అభినందించారు. కాగా ఈ పారాలింపిక్స్ ముందు వరకు దీప్తి క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయగా.. ఈ టోర్నీలో ఆ రికార్డును మరోక ప్లేయర్ బ్రేక్ చేసింది. కాగా తెలంగాణకు చెందిన యువతి ప్రపంచ వేదికలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణమని.. మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. పేద కుటుంబం నుంచి వచ్చిన దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పతకం సాధించడం స్ఫూర్తిదాయకమని.. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయాలు పతకాలు సాధించానలి ఆకాంక్షిస్తున్న ట్లు మంత్రి సీతక్క తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed