- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మీ బిడ్డనై వస్తున్నా... భారీ మెజార్టీతో గెలిపించండి
దిశ, గుమ్మడిదల : మీ బిడ్డనై వస్తున్నా... పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కోరారు. మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామ పరిధిలోని హనుమాన్ దేవాలయంలో గ్రామ ప్రజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో జిల్లా ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పుట్ట నర్సింగరావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, నాయకులు ప్రతాపరెడ్డి, మహిపాల్ రెడ్డి, తిరుమల వాస్, ఆంజనేయులు, నర్సింలు, మల్లేష్, గోపాల్, భిక్షపతి, సాయిచందర్, వినోద్, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.