- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీకి ఓటువేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీ కి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే అవుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో బీఆర్ఎస్ కు మద్దతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్ఎంపీ, పీఎంపీ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందన్నారు. రిజర్వేషన్లు రద్దు పేరిట కాంగ్రెస్, మతం పేరిట బీజేపీ దొంగ నాటకాలు అడుతున్నాయన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై రాహుల్ గాంధీ..రేవంత్ రెడ్డి చేరో మాట మాట్లాడుతున్నారన్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేసిన గ్రామాల్లోనే ఓట్లు అడగాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. సిద్దిపేట జిల్లా తీసేసే కుట్ర జరుగుతుందని ప్రాణం పోయినా జిల్లా తీసెయ్యనియ్యమన్నారు. ఫేక్ ప్రచారాలు చేయడం లో బీజేపీ అభ్యర్థి దిట్ట అన్నారు. దయచేసి వాటిని నమ్మవద్దు అన్నారు. బీజేపీ అభ్యర్థి దుబ్బాకలో ఏమీ చేయలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చదువు తక్కువ బీజేపీ అభ్యర్థి బ్లాక్ మెయిల్ తత్వం అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు హరీష్ రావు గెలుపు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయని మండిపడ్డారు. నా ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పని చేస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి రవీందర్ రెడ్డి, దరిపల్లి శ్రీను, బచ్చు రమేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.