- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పంట పొలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దౌర్జన్యం..
దిశ, చిన్నశంకరంపేట : పంట పొలాన్ని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ధ్వంసం చేసిన సంఘటన చిన్న శంకరం పేట మండల పరిధి కామారం తండా పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 157 సర్వే నెంబర్ గల భూమి హలవత్ లక్ష్మీ పేర ఉందని తెలిపారు. ఆ పొలంలో రెండు నెలలుగా వరిపంట సాగు చేస్తున్నామని లక్ష్మీ భర్త హలవత్ రవి తెలిపారు.
ఆదివారం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రొక్లైనర్ తీసుకొని వచ్చి వరి పంటను ధ్వంసం చేశారని, ఈ విషయాన్ని గమనించి తాను అడ్డుకున్నానన్నారు. అయినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి సముదాయించడంతో హిటాచిను బయటకు తీసుకువెళ్లారని తెలిపారు. ఇకనైనా ఈ రియల్ వ్యాపారి ఆగడాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు హలవత్ రవి, ఆయన కుమారుడు దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.