- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఏటీఎం పగలగొట్టి డబ్బులు దొంగతనానికి ప్రయత్నించిన నిందితుడి అరెస్టు
![ఏటీఎం పగలగొట్టి డబ్బులు దొంగతనానికి ప్రయత్నించిన నిందితుడి అరెస్టు ఏటీఎం పగలగొట్టి డబ్బులు దొంగతనానికి ప్రయత్నించిన నిందితుడి అరెస్టు](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347405-xx.webp)
దిశ, ములుగు : ట్రాలీ ఆటోను దొంగలించి.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం పగలగొట్టి డబ్బులు దొంగతనానికి ప్రయత్నించిన నిందితున్ని గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజులు తెలిపిన వివరాల ప్రకారం… ఈనెల 26న రాత్రి ఫిర్యాదు దారుడు నేతి నాగరాజు ట్రాలీ ఆటో దొంగలించుకొని పోయి అదే విధంగా అదే రోజు రాత్రి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను పగలగొట్టి డబ్బులను దొంగలించుకుని వెళ్లే ప్రయత్నం చేసి విఫలం చెంది పారిపోయాడన్నారు.
గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు చేయగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు సిబ్బందితో కలిసి పరిశోధన ప్రారంభించి మహమ్మద్ అలీ ప్రస్తుత నివాసం ములుగు మండలం వంటిమామిడికి చెందిన నిందితున్ని టెక్నాలజీ ద్వారా గుర్తుపట్టి విచారించి దొంగలించిన ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసులలో అరెస్టు చేసి జ్యుడీషియల్ డిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు. ఈ కేసును టెక్నాలజీ ద్వారా చాకచక్యంగా ఛేదించినందుకు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు, క్రైమ్ సిబ్బందిని గజ్వేల్ ఏసీసీ కే పురుషోత్తం రెడ్డి అభినందించారు.