ముంపు ప్రాంతాల వారికి ఇబ్బందులు లేకుండా చూడాలి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

by Sumithra |
ముంపు ప్రాంతాల వారికి ఇబ్బందులు లేకుండా చూడాలి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం పట్టణంలోని ఐబీలో మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట, మాసాయి కుంట, దూద్ బాయి చెరువు, మాక్స్ నగర్ తదితర చెరువుల నీళ్లు ఇళ్లల్లోకి రావడంతో వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు మళ్ళీ కురిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఏ విధంగా శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందో చెప్పాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అనంతకిషన్, జార్జ్, కూన సంతోష్, కౌన్సిలర్ నాగరాజ్, షఫీ, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed