మల్లారం పెట్రోల్ బంక్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

by Mahesh |
మల్లారం పెట్రోల్ బంక్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
X

దిశ, చిన్నకోడూరు: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మల్లారం పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలకృష్ణ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన కిరణ్ (40) ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన భార్య శైలజ సొంత గ్రామమైన కోహేడ మండలం వరుకోలు గ్రామంలో నివాసం ఉంటున్నారు.

ఆదివారం రాత్రి మల్లారం పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కాగా.. కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చిన్నకోడూరు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed