భారీ మెజార్టీతో నీలం మధు గెలుపు ఖాయం: కొండా సురేఖ

by Disha Web Desk 11 |
భారీ మెజార్టీతో నీలం మధు గెలుపు ఖాయం: కొండా సురేఖ
X

దిశ కొల్చారం: మే నెల 13 న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు భారీ మెజార్టీతో గెలుపు పొందడం ఖాయమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ అన్నారు. శనివారం నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా మార్గమధ్యలో రాంపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నీలం మధుకు మంగళ హారతులతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్ర సంఘం సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు… నీలం మధు ఎన్నికల ప్రచారానికి జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తుందని, మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నీలం మధు గెలుపుకు దోహదం చేస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, పటాన్చెరువు నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ , రాంపూర్ మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, కౌడిపల్లి ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్, పాండు మెదక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నాయకులు ప్రవీణ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed