కోల్‌కతా నుంచి అక్రమ రవాణా.. హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

by GSrikanth |
కోల్‌కతా నుంచి అక్రమ రవాణా.. హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శుక్రవారం ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తుండగా కారు డ్యా్ష్ బోర్డులో రూ.4.5 కోట్ల విలువైన ఆరు కిలోల బంగారం దొరికింది. బంగారం తరలింపునకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలను కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం బంగారం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ అమలులోకి ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసులు, అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వందలకోట్ల రూపాయల నగదు పట్టుబడుతోంది. తెలంగాణలోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల నగదు పట్టుబడుతోంది.

Advertisement

Next Story

Most Viewed