రికార్డు స్థాయిలో ప్రకృతి నివాస్ గణనాథుడి లడ్డూ వేలం..

by Sumithra |
రికార్డు స్థాయిలో ప్రకృతి నివాస్ గణనాథుడి లడ్డూ వేలం..
X

దిశ, గుమ్మడిదల : గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలోని ప్రకృతి నివాస్ కాలనీ లడ్డు రికార్డు స్థాయిలో ధర పలికింది. గత తొమ్మిది రోజులుగా విశేష పూజలు అందుకుంటున్న ప్రకృతి నివాస్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ఆదివారం కాలనీవాసులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన లడ్డూవేలం మొదటి నుండే నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా కొనసాగింది. చివరకు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మద్ది ప్రతాప్ రెడ్డి 2 లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. ఆ గణనాథుడి కృపతో మండల ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

Advertisement

Next Story