ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : నర్సాపూర్ ఎమ్మెల్యే

by Aamani |
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : నర్సాపూర్ ఎమ్మెల్యే
X

దిశ, నర్సాపూర్ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. బుధవారం శివంపేట మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పీఏసీఏస్ ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సునీత రెడ్డి ప్రారంభించారు. రైతులు ఆరుగాలం పండించిన పంట దళారుల పాలు చేయకుండా కొనుగోలు కేంద్రాలను దాన్ని విక్రయించాలని సూచించారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్సూర్, కల్లూరి హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, సత్యం గౌడ్, బాబియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed