Harish Rao : హోంగార్డు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

by Bhoopathi Nagaiah |
Harish Rao : హోంగార్డు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో అక్రమ నిర్మాణం కూల్చివేత లో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డు గోపాల్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కొత్తకాపు శ్రీధర్ రెడ్డిలు మాజీ మంత్రితో ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదని హోంగార్డు లు అంటే అంత చులకనా..? అని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు హోంగార్డు గోపాల్ కుటుంబం చికిత్సకి లక్ష రూపాయలు ఖర్చు చేసిందని, ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదన్నారు. ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది.. పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలల పాటు స్పీచ్ థెరపీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్ళు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారని హరీష్ రావు అన్నారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్ ని, గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గోపాల్ కి పూర్తిగా న్యాయం అయ్యేంత వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, అలాగే గోపాల్ కి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed